చోరీ కేసుల్లో ఆరుగురు నిందితుల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో ఆరుగురు నిందితుల అరెస్ట్‌

Published Sat, Nov 11 2023 12:48 AM

-

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ క్వార్టర్లలో ఇటీవల జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో ఆరుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ క్రైం పోలీసులు అందించిన వివరాలివీ.. సెక్టార్‌–1లోని ఎం. శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో 130 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి కలశం, రెండు మొబైల్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌ను రికవరీ చేశారు. సెక్టార్‌–7లోని హేమంత్‌ లగ్రాయ్‌ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో రెండు ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెక్టర్‌–7లోని 101 క్వార్టర్‌లో ఉంటున్న కె.ఆర్‌.ఎస్‌.నాయుడు క్వార్టర్‌లో జరిగిన దొంగతనం కేసులో మొబైల్‌ ఫోన్‌తో పాటు ఇంట్లో పోయిన నగదుతో నిందితులు కొన్న బైక్‌ను స్వా ధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితులుగా బీసీ రోడ్డు సీతారామ్‌ నగర్‌కు చెందిన ఓ మైనర్‌, దయాళ్‌నగర్‌కు చెందిన ఇద్దరు మైనర్లు, మల్కాపురం జై ఆంధ్ర కాలనీకి చెందిన ఓ మైనర్‌, అదే కాలనీకి చెందిన ఇమిడిశెట్టి భీష్మ(28), మునగపాక విక్రమ్‌ (19)లుగా గుర్తించారు. నలుగురు మైనర్లను నగరంలోని జువైనల్‌ కోర్టులో హాజరుపర్చారు. మిగిలిన ఇద్దరిని గాజువాక 8వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ 14 రోజుల పాటు కోర్టులు రిమాండ్‌ విధించాయి.

Advertisement
Advertisement