Sakshi News home page

వేడుకగా ‘సుందర్‌ స్కైలాంజ్‌’ బ్రోచర్‌ ఆవిష్కరణ

Published Sat, Nov 18 2023 12:26 AM

- - Sakshi

మధురవాడ: ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ వైశాఖీ నూతన వెంచర్‌ ‘సుందర్‌ స్కైలాంజ్‌’బ్రోచర్‌ను మధురవాడ రెవెన్యూ కాలనీలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, వీడియోను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ఆవిష్కరించారు. వైశాఖీ సంస్థ అధిపతులు బలుసు విద్యాసాగర్‌, బలుసు రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు 30 అంతస్తుల్లో గేటెడ్‌ కమ్యూనిటీగా చేపడుతున్నామన్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఒక కొత్త డిజైన్‌, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement