త్వరలో 14 డీసీసీబీ బ్రాంచ్‌లు | Sakshi
Sakshi News home page

త్వరలో 14 డీసీసీబీ బ్రాంచ్‌లు

Published Thu, Nov 30 2023 1:10 AM

పీఏసీఎస్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని
ప్రారంభిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ కోలా గురువులు - Sakshi

నర్సీపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో 14 డీసీసీబీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ కోలా గురువులు చెప్పారు. నర్సీపట్నంలో రూ.53 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌, ది విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ నూతన భవన సముదాయాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీసీసీబీ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రంలో ప్రతి మండలంలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిలో భాగంగానే ఉమ్మడి జిల్లాలో 14 బ్రాంచ్‌లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని బ్రాంచ్‌ల ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సొంత స్థలం ఉండి పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటుకు ఆసక్తి గల వారికి డీసీసీబీ నుంచి రుణాలు మంజూరు చేస్తామన్నారు. డీసీసీబీలో రూ.2,100 కోట్ల టర్నోవర్‌ జరుగుతోందన్నారు. నర్సీపట్నం బ్రాంచ్‌ టర్నోవర్‌ రూ. 110 కోట్లుగా ఉందన్నారు.

Advertisement
Advertisement