నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం | Sakshi
Sakshi News home page

నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం

Published Fri, Dec 15 2023 1:04 AM

-

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం మేయర్‌, స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో 61 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా రూ.49.98 లక్షలతో 34వ వార్డు కొబ్బరితోట కల్యాణ మండపం మొదటి అంతస్తు నిర్మాణం, 84వ వార్డు అనకాపల్లిలో సుంకరమెట్ట జంక్షన్‌ నుంచి జాతీయ రహదారి జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఎడమ వైపు ఉన్న విద్యుత్‌ స్తంభాలు తొలగింపు, 81వ వార్డు మరిడిమాంబ ఆలయం నుంచి ఇందిరమ్మ కాలనీ సీసీ రోడ్డు నిర్మాణం, జోన్‌–3 పరిధి 23వ వార్డు రాజరాజేశ్వరి ఆలయం నుంచి గాయత్రీ పాఠశాల వరకు, చైతన్యనగర్‌, మద్దిలపాలెంలో రూ.48.50 లక్షలతో బీటీ రోడ్ల పునరుద్ధరణ, జోన్‌–6 పరిధి 77వ వార్డులో నమ్మిదొడ్డి ప్రధాన రహదారి బీటీ రోడ్డు వెడల్పు, రాజీవ్‌నగర్‌ బీటీ రోడ్డు వెడల్పు, మిగిలిన చేపలపాలెం వంతెన పనులు పూర్తి, జోన్‌–1 పరిధి ఒకటో వార్డులో చిట్టివలస జ్యూట్‌మిల్లు రోడ్డు నుంచి కొండపేట జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వరకు రూ.39.40 లక్షలతో రోడ్లు, కాలువల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరగనుంది. నగర పరిధిలో డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు వ్యాపిస్తున్న దృష్ట్యా.. స్లం లెవల్‌ ఫెడరేషన్‌ ప్రక్రియ ద్వారా అదనపు సిబ్బందితో వెక్టర్‌ కంట్రోల్‌ కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement