కలెక్టర్‌కు అభినందనలు | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు అభినందనలు

Published Sat, Dec 23 2023 1:04 AM

- - Sakshi

● జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణ అద్భుతం ● కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు

సాక్షి, విశాఖపట్నం : ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిర్వహణ విషయంలో విశాఖ జిల్లా అధికారులు, సిబ్బంది అద్భుతంగా వ్యవహరిస్తూ నిబంధనల మేరకు జాబితాలో సవరణలు చేపట్టారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్‌ డా.మల్లికార్జునను అభినందించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై రెండు రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలతో విజయవాడలో సమీక్ష సమావేశం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా నుంచి కలెక్టర్‌ డా.మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ డా.రవిశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకూ నిర్వహించిన ప్రక్రియకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్‌ కేంద్ర ఎన్నికల అధికారుల బృందానికి వివరించారు. ప్రతి ఇంటినీ సందర్శించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తు.చ. తప్పకపాటిస్తూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా జిల్లాలో శతశాతం పూర్తిచేయడం పట్ల కేంద్ర బృందం కలెక్టర్‌ను ప్రశంసించింది.

Advertisement
Advertisement