కేజీహెచ్‌లో పడకలు సిద్ధం | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో పడకలు సిద్ధం

Published Sat, Dec 23 2023 1:04 AM

కేజీహెచ్‌లో సిద్ధమైన ఆక్సిజన్‌ పడకలు - Sakshi

మహారాణిపేట: జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేజీహెచ్‌ క్యాజువాలిటీలోని ఐసోలేషన్‌ వార్డుతోపాటు మరో వార్డులో మొత్తం 140 పడకలను సిద్ధం చేశారు. క్యాజువాలిటీలో ఉన్న 100 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. సీఎస్సార్‌ వార్డులో 40 పడకలను వెంటిలేటర్‌తో సిద్ధం చేసినట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌ తెలిపారు. కాగా.. కరోనా కొత్త వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంత మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

100 ఆక్సిజన్‌, 40 వెంటిలేటర్‌

పడకలను సిద్ధం చేసిన అధికారులు

Advertisement
Advertisement