రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఆర్‌వీపురం విద్యార్థులు | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఆర్‌వీపురం విద్యార్థులు

Published Sat, Dec 23 2023 1:04 AM

ఎంపికై న విద్యార్థులను అభినందిస్తున్న హెచ్‌ఎం శంకరరావు, ఉపాధ్యాయులు 
 - Sakshi

పద్మనాభం: మండలంలోని ఆర్‌వీపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని పాఠశాలలో శుక్రవారం హెచ్‌ఎం విజినిగిరి శంకరరావు, వ్యాయాయ ఉపాధ్యాయలు సీహెచ్‌.రవికుమార్‌, రెడ్డిపల్లి శంకరరావు ఉపాధ్యాయులు పాఠశాలలో అభినందినంచారు. పాఠశాలకు చెందిన ఎస్‌.కిశోర్‌, కె.తులసీరామ్‌, ఎం.సాయికుమార్‌, టి.చిరణ్‌, ఎం.హిందు, కె.శృతి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 24వ తేదీన జరగునున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు.

Advertisement
Advertisement