అవార్డు అందుకుంటున్న పోక్సో కోర్టు స్పెషల్ పీపీ కరణం కృష్ణ
విశాఖ సిటీ : విశాఖ ప్రత్యేక పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ పాసిక్యూటర్ కరణం కృష్ణకు ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాష్ట్ర స్థాయి సదస్సు శనివారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చేసిన విశాఖ పోక్సో కోర్టు స్పెషల్ పీపీని అభినందించారు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కరణం కృష్ణ ఉత్తమ ప్రతిభా అవార్డును అందజేశారు.