నేడు ఉక్కు కార్మికుల మహా పాదయాత్ర | Sakshi
Sakshi News home page

నేడు ఉక్కు కార్మికుల మహా పాదయాత్ర

Published Sun, Mar 3 2024 8:45 AM

-

ఉక్కునగరం: ఉక్కు పరిరక్షణ, పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు కూర్మన్నపాలెం దీక్ష శిబిరం నుంచి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేయనున్నారు. ఇందులో ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గోనున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను పాదయాత్రకు ఆహ్వానించారు. పాదయాత్రలో ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొనాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు.

Advertisement
Advertisement