● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల
విజయనగరం ఫోర్ట్: పరిశోధనలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధన అనే అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. పరిశోధనలు చేసేటప్పడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పరిశోధనలు ఏ విధంగా చేయాలి, జర్నల్స్ ఏ విధంగా పబ్లిష్ చేయాలి వంటి వాటిపై వివరించారు. సమాజంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న సందర్భాల్లో వాటిని అరికట్టేందుకు అవసరమైన వాటిపై పరిశోధనలు జరగాల్సిన అవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిలాసునందని, ఆర్ఎంఓ డాక్టర్ సురేష్బాబు, ఫామకాలజీ హెచ్ఓడీ డాక్టర్ అన్నపూర్ణ, మైలాన్ జనరల్ మేనేజర్ విజయభూషణం, మిమ్స్ వైద్య కళాశాల ఎనస్తషీయా విభాగం వైద్యులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.