కస్పా విద్యార్థులకు అభినందనలు | Sakshi
Sakshi News home page

కస్పా విద్యార్థులకు అభినందనలు

Published Thu, Nov 16 2023 1:26 AM

ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికై న లిఖిత్‌ కుమార్‌  - Sakshi

విజయనగరం: విద్యార్ధుల్లో దాగి ఉన్న క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఏడాది నిర్వహించే స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో విజయనగరంలోని కస్పా కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తూ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అండర్‌–19 విభాగంలో జమ్ము కశ్మీర్‌లో నిర్వహించే జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించిన కస్పా పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి ఆర్‌.లిఖిత్‌కుమార్‌ ఎంపికయ్యాడు. అలాగే ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు కాకినాడలో జరగబోయే అండర్‌–17 బాలుర ఖోఖో పోటీలకు విద్యార్ధి షేక్‌ సలీం ఎంపికయ్యాడు. రాష్ట్ర, జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్‌, సౌదామిని తదితరులు అభినందించారు.

ఖోఖో పోటీలకు ఎంపికై న షేక్‌సలీంతో పాఠశాల హెచ్‌ఎం శఽంకరరావు
1/1

ఖోఖో పోటీలకు ఎంపికై న షేక్‌సలీంతో పాఠశాల హెచ్‌ఎం శఽంకరరావు

Advertisement
Advertisement