నెల్లిమర్ల: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామివారి దేవస్థానంలోని హుండీ ఆదాయం రూ.29లక్షల 87వేల 349 వచ్చినట్టు ఆలయ ఈఓ కిశోర్కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఆలయంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను సోమవారం లెక్కించారు. హుండీల పర్యవేక్షణ అధికారిణి వి.వి.లక్ష్మి, ట్రస్టు బోర్డు సభ్యులు డి.సత్యనారాయణరాజు, బూర్లి సత్యం, రామతీర్థం ఏపీజీవీబీ సిబ్బంది, రామతీర్థం దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవ సంఘం (విశాఖపట్నం) సభ్యులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.87లక్షలు
Published Tue, Dec 19 2023 1:08 AM
Related news
-
వాస్తవం ఇది..
ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టికెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డివాములు, వాటర్ పైపులు దగ్ధం రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో మీసాల రమేష్కు చెందిన ఎకరన్నర గడ్డివాము, 80 నీటి పైపులు దగ్ధమయ్యాయి. గురువారం గడ్డివాము వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనువెంటనే ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకుని కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అలాగే సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన బెరవ అప్పలనాయుడు, బెవర రాజారావుల గడ్డివాములతో పాటు 20 బస్తాల ధాన్యం కాలిపోయాయి. రాజాం ఫైర్ స్టేసన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సారాతో వ్యక్తి అరెస్టు సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ మాకొద్దు బాబూ...
చీపురుపల్లి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలన చూసి టీడీపీ వర్గీయులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. సైకిల్ మాకొద్దు.. ఫ్యానే ముద్దు అంటూ వలసపోతున్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పలు చేరికలు జరిగాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఆకులపేట గ్రామానికి చెందిన పిన్నింటి, కొండేటి, మీసాల, పతివాడ ఇంటి పేరుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. ఇటీవల తమకు తెలియకుండానే టీడీపీ కండువాలు తమకు వేశారని, టీడీపీలో ఉండే పరిస్థితే లేదని వారంతా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి వచ్చిన వీరికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మీసాల హరి, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు నుంచి చేరికలు ఇదిలా ఉండగా పట్టణంలోని జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని 13వ వార్డు నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల టీడీపీలో చేరిన 13వ వార్డు మెంబరు తల్లి సంగంరెడ్డి కనకమ్మ, సంగంరెడ్డి శివ, వెలుసూరి వెంకటరమణ తదితరులకు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జుజ్జూరు వర్మ, కంచుపల్లి అశోక్, అడ్డూరి కృష్ణ, బుంగ కనకేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీకి భారీ షాక్ రేగిడి : టీడీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలో లక్ష్మీపురం గ్రామంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. గురువారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన నేదూరి దుర్గయ్య, బొంతల సంగయ్య, మిరియాలు జప్పన్న, కాయల తవుడు, జోరీగల వెంకటి, కాయల రామారావు, బొంతల రామయ్య, బొంతల అప్పలరాం, నేదూరి అప్పలరాం, మిరియాల లోకేష్ తదితరులతో పాటు మరో 40కి పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ప్రజలు అంతా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కెంబూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఎర్నేన అప్పలనాయుడు, అప్పాపురం సర్పంచ్ కరణం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పాలవలస దవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలోకి... ● పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని దువ్వాం పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీసివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోనికి వచ్చిన లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధి బాలి రామారావు, బాలి రమణ, బాలి కూర్మారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పతివాడ తవిటినాయుడు, రెల్లి పైడినాయుడు, గొర్లె లోకేష్, గొర్లె చిన్న, బాలాజీ తదితర 50 కుటుంబాలకు చెందిన వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలన్నా ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లును వేసి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నేతేటి కృష్ణవేణి, స్థానిక నాయకుడు తోట రవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొణిశ కృష్ణంనాయుడు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి వలసల జోరు -
అప్పుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: అప్పులు తీర్చలేనన్న భయంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర అలియాస్ ఆది (45) విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు ఇంట్లో భార్యకు తెలియకుండా రూ.50వేల వరకు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై బుధవారం ఉదయం అరటి తోట వద్ద పురుగుల మందు తాగి వాంతులు చేసుకొంటూ ఇంటికి చేరుకున్నాడు. భార్య పద్మ చూసి ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో కుటుంబీకుల సహాయంతో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి తల్లి అప్పలనర్సమ్మ, భార్య పద్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం
● సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం ● సంఘటన స్థలంలోనే మహిళ మృతి ● మరో పదకొండు మందికి తీవ్రగాయాలు గుమ్మలక్ష్మీపురం/కురుపాం: వివాహానంతరం వధువుకు ఇవ్వాల్సిన సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లివారింట విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..మరో 11 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలంలోని కాకితాడ గ్రామానికి చెందిన పెద్దింటి కాంతారావు, సరోజినిల కుమార్తె లిజితకు కొమరాడ మండలంలోని పూడేసు గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే వివాహమైంది. వధువుకు సారిసామగ్రి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ట్రక్కర్లు్, ఆటోల్లో బయల్దేరారు. ఈ క్రమంలో అందరికంటే వెనుకగా వధువు సొంతకుటుంబీకులను తీసుకువెళ్తున్న ట్రక్కర్ రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో అదుపుతప్పి ప్రధానరహదారిలోని కల్వర్టుగోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వధువు మేనత్త కమిడి కమల(55) అక్కడికక్కడే మృతిచెందగా..మృతురాలి తమ్ముడు పెద్దింటి భుజంగరావు, మరదలు సుజాత, మరో మేనకోడలు బి. సుగుణ, మేనకోడలి కుమారుడు చైతన్య, మేనకోడలు సుగుణ భర్త రవితో పాటు ఇతర కుటుంబసభ్యులు గంటా పవన్, లిమ్మ సుమన్, పాలక శశిరేఖ, పి.మారతమ్మ, ఎన్.పుష్పరాజ్లతో పాటు డ్రైవర్ తేజ తీవ్రగాయాలపాయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఇతర కుటుంబసభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కమలను పరీక్షించిన వైద్యాధికారి రవికుమార్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే తల పుర్రెభాగంలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చైతన్యతో పాటు మారతమ్మ, పుష్పరాజు, తదితరులను మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కురుపాం ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపారు.
Related News by category
-
వాస్తవం ఇది..
ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు. -
వ్యక్తిపై కత్తితో దాడి
వేపాడ: మండలంలోని వావిలపాడు గ్రామానికి చెందిన ఎం.సన్యాసిరావును అదే గ్రామానికి చెందిన ఆరిపాక సంతోష్ కత్తితో గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడటంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. దీనికి సంబంధించి ఎస్ఐ అందించిన వివరాలు.. వావిలపాడుకు చెందిన ఆరిపాక సంతోష్ మద్యం సేవిస్తూ వుంటాడు. సన్యాసిరావుకు సంతోష్ వరుసకు కుమారుడు అవుతాడు. మద్యం సేవించడం మంచిది కాదని సంతోష్ను మందలిస్తూ వుండే వాడు. దీన్ని తట్టుకోలేని సంతోష్ గురువారం ఉదయం సన్యాసిరావు ఇంటికి వెళ్లి కత్తితో పీకపై గాయపర్చి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో కుటుంబీకులు సమీపంలో వున్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంతోష్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి చర్యలు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులైన్స్లో నడపబడుతున్న పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఎస్పీ ఎం.దీపిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాఽథ్స్, ఫిజిక్స్ బయాలజీతో పాటూ ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతను తెలిపే ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెజ్యూమ్ తీసుకుని ఏప్రిల్ 26 ఉదయం 10 గంటలకు పాఠశాలలో నిర్వహించబోయే టీచింగ్ డెమో, మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ విద్యార్హతతో పాటూ అర్హతలు కలిగిన అభ్యర్థులు స్కూల్లో నిర్వహించే మౌఖిక పరీక్షకు ఆ రోజు హాజరు కావాలన్నారు. వివరాలకు 94917 99315, 91211 09485 సంప్రదించాలని కోరారు. వెబ్సైట్లో డీఎడ్ హాల్టికెట్లువిజయనగరం అర్బన్: ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే డీఎడ్ మూడవ సెమిస్టర్ (2022–24 బ్యాచ్ మరియు ఒన్స్ ఫైల్డ్), మొదటి సెమిస్టర్ (2023–25 బ్యాచ్ మరియు ఒన్స ఫైల్డ్) పరీక్షలకు హాజరగు విద్యార్థులకు హాల్ టికెట్లు వెబ్సైట్లో పొందుపరచామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ‘బీఎస్ఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాలికపై లైంగిక దాడి డెంకాడ: మండలంలోని ఒక గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. దిశ పోలీసులు అందించిన వివరాలు.. బుధవారం ఏడేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విజయనగరంలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయనగరం దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డివాములు, వాటర్ పైపులు దగ్ధం రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో మీసాల రమేష్కు చెందిన ఎకరన్నర గడ్డివాము, 80 నీటి పైపులు దగ్ధమయ్యాయి. గురువారం గడ్డివాము వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి వెనువెంటనే ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకుని కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పొందూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. అలాగే సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన బెరవ అప్పలనాయుడు, బెవర రాజారావుల గడ్డివాములతో పాటు 20 బస్తాల ధాన్యం కాలిపోయాయి. రాజాం ఫైర్ స్టేసన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సారాతో వ్యక్తి అరెస్టు సీతానగరం: మండలంలోని బక్కుపేట గ్రామంలో ఎస్ఈబీ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం తనిఖీలు చేపట్టిన సమయంలో 190 సారా ప్యాకెట్లతో ఓ వ్యక్తి పట్టుబడగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గ్రామానికి చెందిన పి. లక్ష్మణదొర ఇంట్లో తనిఖీలు చేసి సారాను గుర్తించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాజశేఖర్ పట్నాయక్, జె.జగన్నాథరావు, ఎం. శ్రీవాణి, హెచ్సీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ మాకొద్దు బాబూ...
చీపురుపల్లి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలన చూసి టీడీపీ వర్గీయులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. సైకిల్ మాకొద్దు.. ఫ్యానే ముద్దు అంటూ వలసపోతున్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం పలు చేరికలు జరిగాయి. చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని ఆకులపేట గ్రామానికి చెందిన పిన్నింటి, కొండేటి, మీసాల, పతివాడ ఇంటి పేరుకు చెందిన 30 కుటుంబాలు టీడీపీను వీడి వైఎస్సార్ సీపీలో చేరాయి. ఇటీవల తమకు తెలియకుండానే టీడీపీ కండువాలు తమకు వేశారని, టీడీపీలో ఉండే పరిస్థితే లేదని వారంతా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలోకి వచ్చిన వీరికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మీసాల హరి, గవిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు నుంచి చేరికలు ఇదిలా ఉండగా పట్టణంలోని జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని 13వ వార్డు నుంచి పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల టీడీపీలో చేరిన 13వ వార్డు మెంబరు తల్లి సంగంరెడ్డి కనకమ్మ, సంగంరెడ్డి శివ, వెలుసూరి వెంకటరమణ తదితరులకు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జుజ్జూరు వర్మ, కంచుపల్లి అశోక్, అడ్డూరి కృష్ణ, బుంగ కనకేశ్వరరావు తదితరులు ఉన్నారు. టీడీపీకి భారీ షాక్ రేగిడి : టీడీపీకి భారీ షాక్ తగిలింది. మండలంలో లక్ష్మీపురం గ్రామంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. గురువారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైస్ ఎంపీపీ టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీకి చెందిన నేదూరి దుర్గయ్య, బొంతల సంగయ్య, మిరియాలు జప్పన్న, కాయల తవుడు, జోరీగల వెంకటి, కాయల రామారావు, బొంతల రామయ్య, బొంతల అప్పలరాం, నేదూరి అప్పలరాం, మిరియాల లోకేష్ తదితరులతో పాటు మరో 40కి పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనను ప్రజలు అంతా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కెంబూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ ఎర్నేన అప్పలనాయుడు, అప్పాపురం సర్పంచ్ కరణం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పాలవలస దవళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలోకి... ● పార్టీలోకి ఆహ్వానించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని దువ్వాం పంచాయతీ నుంచి టీడీపీకి చెందిన 50 కుటుంబాలు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీసివాసరావు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోనికి వచ్చిన లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధి బాలి రామారావు, బాలి రమణ, బాలి కూర్మారావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పతివాడ తవిటినాయుడు, రెల్లి పైడినాయుడు, గొర్లె లోకేష్, గొర్లె చిన్న, బాలాజీ తదితర 50 కుటుంబాలకు చెందిన వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలన్నా, మంచి అభివృద్ధి కార్యక్రమాలు అమలు కావాలన్నా ప్రతీ ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లును వేసి ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించి జగన్మోహన్రెడ్డిని సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నేతేటి కృష్ణవేణి, స్థానిక నాయకుడు తోట రవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొణిశ కృష్ణంనాయుడు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి వలసల జోరు -
పెళ్లింట విషాదం
● సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం ● సంఘటన స్థలంలోనే మహిళ మృతి ● మరో పదకొండు మందికి తీవ్రగాయాలు గుమ్మలక్ష్మీపురం/కురుపాం: వివాహానంతరం వధువుకు ఇవ్వాల్సిన సారి సామగ్రి ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లివారింట విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..మరో 11 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కురుపాం మండలంలోని కాకితాడ గ్రామానికి చెందిన పెద్దింటి కాంతారావు, సరోజినిల కుమార్తె లిజితకు కొమరాడ మండలంలోని పూడేసు గ్రామానికి చెందిన యువకుడితో ఇటీవలే వివాహమైంది. వధువుకు సారిసామగ్రి ఇచ్చేందుకు కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ట్రక్కర్లు్, ఆటోల్లో బయల్దేరారు. ఈ క్రమంలో అందరికంటే వెనుకగా వధువు సొంతకుటుంబీకులను తీసుకువెళ్తున్న ట్రక్కర్ రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో అదుపుతప్పి ప్రధానరహదారిలోని కల్వర్టుగోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వధువు మేనత్త కమిడి కమల(55) అక్కడికక్కడే మృతిచెందగా..మృతురాలి తమ్ముడు పెద్దింటి భుజంగరావు, మరదలు సుజాత, మరో మేనకోడలు బి. సుగుణ, మేనకోడలి కుమారుడు చైతన్య, మేనకోడలు సుగుణ భర్త రవితో పాటు ఇతర కుటుంబసభ్యులు గంటా పవన్, లిమ్మ సుమన్, పాలక శశిరేఖ, పి.మారతమ్మ, ఎన్.పుష్పరాజ్లతో పాటు డ్రైవర్ తేజ తీవ్రగాయాలపాయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన ఇతర కుటుంబసభ్యులు క్షతగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కమలను పరీక్షించిన వైద్యాధికారి రవికుమార్ ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అలాగే తల పుర్రెభాగంలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడు చైతన్యతో పాటు మారతమ్మ, పుష్పరాజు, తదితరులను మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కురుపాం ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపారు. -
అప్పుల భయంతో వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: అప్పులు తీర్చలేనన్న భయంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని చినభీమవరం గ్రామానికి చెందిన ఉయ్యాల నూకందొర అలియాస్ ఆది (45) విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్టు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు ఇంట్లో భార్యకు తెలియకుండా రూ.50వేల వరకు అప్పులు చేశాడు. ఈ మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై బుధవారం ఉదయం అరటి తోట వద్ద పురుగుల మందు తాగి వాంతులు చేసుకొంటూ ఇంటికి చేరుకున్నాడు. భార్య పద్మ చూసి ఏమైందని ప్రశ్నించగా పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో కుటుంబీకుల సహాయంతో 108 ద్వారా స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి తల్లి అప్పలనర్సమ్మ, భార్య పద్మ ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
Advertisement