Sakshi News home page

రామతీర్థం హుండీల ఆదాయం రూ.29.87లక్షలు

Published Tue, Dec 19 2023 1:08 AM

రామతీర్థంలో హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది  - Sakshi

నెల్లిమర్ల: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామివారి దేవస్థానంలోని హుండీ ఆదాయం రూ.29లక్షల 87వేల 349 వచ్చినట్టు ఆలయ ఈఓ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 11 నుంచి డిసెంబర్‌ 18వ తేదీ వరకు ఆలయంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను సోమవారం లెక్కించారు. హుండీల పర్యవేక్షణ అధికారిణి వి.వి.లక్ష్మి, ట్రస్టు బోర్డు సభ్యులు డి.సత్యనారాయణరాజు, బూర్లి సత్యం, రామతీర్థం ఏపీజీవీబీ సిబ్బంది, రామతీర్థం దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవ సంఘం (విశాఖపట్నం) సభ్యులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement