చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

Published Fri, Dec 22 2023 12:58 AM

-

భోగాపురం: మండలంలోని రాజాపులోవ గ్రామంలో ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన కిలారి అప్పయ్యమ్మ(75) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్సై రాజు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 15వ తేదీన ఇంట్లో మంట వేసుకుని చాలి కాగుతుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని అప్పయ్యమ్మ తీవ్ర గాయాలపాలైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విశాపట్నం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి కుమారుడు రాములప్పుడు ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement