విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Published Thu, Feb 1 2024 2:24 AM

-

లక్కవరపుకోట: మండలంలోని కళ్లేపల్లి గ్రామం సమీపంలో తాటిచెట్లు నరుకుతుండగా వేపాడ మండలం చిన్నగుడిపాల గ్రామానికి చెందిన భోజంకి గోవింద(51) విద్యుత్‌ షాక్‌కు గురై బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోవింద వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఈ క్రమంలో తాటిచెట్లను నరికేందుకు కళ్లేపల్లి గ్రామం వచ్చాడు. ఇనుప నిచ్చెన వేసుకుని ఒక చెట్టు నరికి మళ్లీ వేరే చెట్టు వద్దకు నిచ్చెన తీసుకువెళ్తున్న సమయంలో పొలంలో బోరుబావికి వెళ్లే త్రీఫేస్‌ లైన్‌కు నిచ్చెన తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై పడిపోయాడు. గమనించిన స్థానికలు హుటాహుటిన ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ కొండబాబు తెలిపారు.

Advertisement
Advertisement