సారిపల్లి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ | Sakshi
Sakshi News home page

సారిపల్లి శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

Published Sun, Mar 3 2024 8:45 AM

సారిపల్లి డీటీసీని పర్యవేక్షిస్తున్న ఎస్పీ ఎం.దీపిక - Sakshi

విజయనగరం క్రైమ్‌: సార్వత్రిక ఎన్నికల విధులకు త్వరలో జిల్లాకు రానున్న కేంద్ర బలగాలు సారిపల్లి జిల్లా శిక్షణ కేంద్రంలో బస చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఎస్పీ ఎం.దీపిక శనివారం పరిశీలించారు. శిక్షణ కేంద్రంలోని గదులు, మంచాలు, నీటి వసతులు, వంట గదులు, భోజనశాల తదితర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు సిబ్బంది ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అస్మా ఫర్హీన్‌, ట్రైనీ ఐపీఎస్‌ కుమారి మండ జావలి అల్ఫాన్స్‌, డీటీసీ డీఎస్పీ వీరకుమార్‌, విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు, ఏఆర్‌ డీఎస్పీ యూనివర్స్‌, ఎస్‌బీ సీఐ ఇ.నరసింహమూర్తి, టూటౌన్‌ సీఐ కె.రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement