ఆంధ్రప్రదేశ్ పునర్వభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వ మంజూరు చేసింది. ఈ యూనివర్సిటీని గిరిజన ప్రాంతం, రిజర్వ్డ్ అసంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్మించాలి. దీనికోసం తొలివిడతగా రూ.834 కోట్లను కేటాయించి రూ.426 కోట్లను విడుదల చేసింది. దీంతో చంద్రబాబునాయుడు అండ్ కో చకచకా పావులు కదిపారు. యూనివర్సిటీ నిర్మాణ నిబంధనలను తుంగలో తొక్కేశారు. ముందుగా విశాఖకు అతి సమీపంలోని కొత్తవలస ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం, వాటికి ఆనుకొనిఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం వంటి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అతి తక్కవ ధరకు వందల ఎకరాలను కూడబెట్టారు. ప్లాట్లు వేశారు. ఇదంతా చూసిన స్థానికులు వీరికేం పిచ్చి.. నివాసయోగ్యంకాని చోట ప్లాట్లు వేస్తున్నారని అనుకున్నారు. అప్పుడే మొదలైంది చంద్రబాబు డ్రామా. వారి రియల్ వ్యాపారానికి జాతీయ గిరిజన యూనివర్సిటీ పేరు పెట్టారు. నిబంధనలు దాచిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. 2017 సంవత్సరంలో కొత్తవలస మండ లం రెల్లి రెవెన్యూ గ్రామం అప్పన్న దొరపాలెం సమీపంలో నిర్మాణానికి ఏ మాత్రం అనువుగా లేని కొండ ప్రాంతంలో సర్వే నంబర్ 1–8లో 526.24 ఎకరాల భూమిని గుర్తించారు. ఇందులో కొంత కొండవాలు ప్రాంతంలో 180 మందికి ఇచ్చిన పట్టా భూమి 185 ఎకరాలను సైతం సేకరించారు. యూనివర్సిటీ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందంటూ కేంద్రానికి నివేదికలను పంపారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగా హడావిడిగా అప్పటి భూగర్భ గనులశాఖ మంత్రి సుజయకృష్ణరంగారావు చేతుల మీదుగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సమక్షంలో 2017 డిసెంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించి ఈ ప్రాంతం వర్సిటీ నిర్మాణానికి అనువుగా లేదని, ఈ ప్రాంతం ఎస్టీ సెగ్మెంట్లో లేదని వ్యతిరేకించారు. నివేదిక సైతం ఇచ్చారు. అయినా.. తమ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తయ్యేవరకు చంద్రబాబు అండ్ కో ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. తమ అనుకూల మీడియాతో ఈ ప్రాంతం ఆంధ్రాయూనివర్సిటీ పరి సరాల వలే అభివృద్ధి చెందుతుందని, వర్సిటీ ప్రహరీ పనులు ప్రారంభమైపోయాయంటూ ఊహాజనిత కథనాలతో ప్రచారం చేశారు. ఒక్క ప్రహరీతో కారుచౌకగా కొనుగోలు చేసిన భూ ములను వందలకోట్ల రూపాయలకు అమ్మేసి.. కొనుగోలుదారులకు పంగనామం పెట్టారు.
వాస్తవం ఇది..
Published Fri, Apr 19 2024 1:15 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement