జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం కందులకు క్వింటాల్ గరిష్టంగా రూ.8,770, కనిష్టంగా రూ.7,855 ధర లభించింది. అదేవిధంగా వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,769, కనిష్టంగా రూ.6,166 ధర దక్కింది. ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి క్వింటాల్ గరిష్టంగా రూ.3,209, కనిష్టంగా రూ.2679, హంస రకానికి గరిష్టంగా రూ.2,040, కనిష్టంగా రూ.2,000, మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,267, కనిష్టంగా రూ. 2,222, ఆముదాలు రూ.5,272, పత్తి గరిష్టంగా రూ. 6,689, కనిష్టంగా రూ.3,590, రాగులు రూ.3,639, మినుములు రూ.8,887 ధరలు లభించాయి.
ఆముదాల ధర రూ.5,350
దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన ఈనామ్ టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.5,350, కనిష్టంగా రూ.5,209గా ధరలు లభించాయి. కందుల ధర గరిష్టంగా రూ.8,839, కనిష్టంగా రూ.8,619గా ధరలు నమోదయ్యాయి. సీజన్ తగ్గడం వల్ల మార్కెట్కు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.