11న టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

11న టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు

Published Thu, Nov 9 2023 1:50 AM

-

పర్వతగిరి: పర్వతాల శివాలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా ఈనెల 11వ తేదీన తాడుగుంజుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడుగుంజుడు పోటీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఆసక్తిపరులు పాల్గొనాలని కోరారు. మొదటి బహుమతి రూ.40వేలు, ద్వితీయ బహుమతి 30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు ఉంటుందని తెలిపారు. ప్రతి టీంలో పది మంది సీ్త్రలు, పది మంది పురుషులు తప్పనిసరి అని, ఒక టీమ్‌లో ఒక గ్రామానికి చెందిన వారు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. టీమ్‌ సభ్యులు వారి ఆధార్‌ జిరాక్స్‌ తీసుకుని రావాలని, ప్రతి టీమ్‌ 95738 79358 నంబర్‌కు ఫోన్‌ చేసి రిజిష్టర్‌ చేసుకోవాలని తెలిపారు. తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదేనని పేర్కొన్నారు. టీం సభ్యులు శనివారం ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement