ఎపిక్‌ కార్డులు త్వరగా పంపిణీ చేయండి | Sakshi
Sakshi News home page

ఎపిక్‌ కార్డులు త్వరగా పంపిణీ చేయండి

Published Tue, Nov 14 2023 1:14 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ 
 - Sakshi

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో ఇంకా పంపిణీ చేయకుండా.. మిగిలి ఉన్న ఎపిక్‌ కార్డులను త్వరగా.. పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎపిక్‌ కార్డుల పంపిణీపై ఎన్నికల అధికారులతో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 56,753 ఎపిక్‌ కార్డులు ఉండగా.. పంపిణీ కోసం పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపించినట్లు తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు 43,200 కార్డులు పంపిణీ చేసినట్లు, మిగిలినవి త్వరలో పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ట్రెయినీ కలెక్టర్‌ శ్రద్ధా శుక్ల, కలెక్టరేట్‌ ఏఓ సత్యనారాయణ, సురేశ్‌ పాల్గొన్నారు.

ఆలయ సందర్శన

హన్మకొండ అర్బన్‌: దీపావళి సందర్భంగా నగరంలోని ఎన్జీఓస్‌ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీఎస్‌పీఎస్సీ సభ్యులు కారం రవీందర్‌, ఉద్యోగ సంఘాల నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా వారిని ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు జరిపారు. ఈసందర్భంగా ఈనెల 14 (నేటి) నుంచి ప్రారంభం కానున్న స్వామి వారి బ్రహోత్సవాల గురించి ఆలయ ధర్మకర్తలతో సమావేశం నిర్వహించి చర్చించారు. కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్‌ సుబ్బారావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా గెజిటెడ్‌ అధికారుల సంఘం కో–ఆర్డినేటర్‌ అన్నమనేని జగన్‌మోహన్‌రావు, హనుమకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ అంజద్‌ అలీ, హసన్వుద్దీన్‌ పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement