అవినీతిని అంతమొందించాలి | Sakshi
Sakshi News home page

అవినీతిని అంతమొందించాలి

Published Thu, Nov 16 2023 1:26 AM

మాట్లాడుతున్న ఆకునూరి మురళి  - Sakshi

కాజీపేట: తెలంగాణలో పదేళ్లుగా కొనసాగుతున్న అవినీతి, ఆర్థిక దోపిడీని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కాజీపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మత విద్వేష, విభజన నియంతృత్వ పాలనతో ఆదానీ, అంబానీలకు సేవలు చేస్తున్న పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించండి

మడికొండ: బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలని ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. ఓటర్లకు అవగాహన, చైతన్య యాత్రలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ నుంచి ఆయన మడికొండ చౌరస్తాకు బస్సులో వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైన కేసీఆర్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపాలన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చిందన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులు కేసీఆర్‌ ప్రభుత్వానికి గోరి కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రీతీ, శ్రీనివాస్‌, కళకారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement