● చిటికెన వేలు గోరుపై కాటన్‌ దొర | Sakshi
Sakshi News home page

● చిటికెన వేలు గోరుపై కాటన్‌ దొర

Published Mon, May 15 2023 12:50 AM

- - Sakshi

ఆనకట్టలను నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత సర్‌ ఆర్దర్‌ కాటన్‌కే దక్కుతుంది. పూర్వ ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ఆయనను కాటన్‌ దొర అంటూ ఎంతో అభిమానంతో పిలుచుకుంటారు. ఏలూరుకు చెందిన సూక్ష్మకళాకారుడు మేతర సురేష్‌బాబు అగ్గిపుల్లపై సర్‌ ఆర్దర్‌ కాటన్‌ చిత్రాన్ని చెక్కి చిటికెన వేలు గోరుపై నిలిపి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ సోమవారం సర్‌ ఆర్దర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. – ఏలూరు (టూటౌన్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement