వైఎస్సార్‌ సీపీలో నూతనోత్సాహం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో నూతనోత్సాహం

Published Sat, Aug 26 2023 1:10 AM

జిల్లా అధ్యక్షుడు శ్రీరంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్న నాయకులు   - Sakshi

పెనుగొండ: వైఎస్సార్‌ సీపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని అన్నివర్గాలకు న్యాయం చేస్తూ నియమించడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజును మరోసారి నియమిస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లావ్యాప్తంగా కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపింది. శుక్రవారం తూర్పుపాలెంలోని శ్రీరంగనాథరాజు కార్యాలయానికి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు తరలివచ్చారు. అవకాశం కల్పించిన వారు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు శ్రీరంగనాథరాజును ఘనంగా సత్కరించారు. పార్టీని మరింత బలోపేతం చేసి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి విజయం సాఽధించేందుకు కృషి చే స్తామంటూ ఉత్సాహంగా ప్రకటించారు. ఉండి, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట, భీమ వరం నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యవర్గానికి ఎంపికై న వారంతా వచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు తన్నేటి జగజ్జీవన్‌రావు (తాడేపల్లిగూడెం), జనరల్‌ సెక్రటరీ ఏడిద వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొచ్చా అచ్చారావు (ఉండి), జిల్లా జనరల్‌ కార్యదర్శి దంపనబోయిన బాబూరావు, జిల్లా కార్యదర్శి దిద్దే శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు సుంక నాగాబాబు, సత్తి వెంకటరెడ్డి, దొంగ దుర్గా ప్రసాద్‌, గొల్లపల్లి బాలకృష్ణ (ఆచంట) తదితరులు వందలాది మంది పార్టీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement