వర్షం.. హర్షం | Sakshi
Sakshi News home page

వర్షం.. హర్షం

Published Sun, Sep 24 2023 12:32 AM

-

ఏలూరు (మెట్రో): బంగాళాఖాతంలో అల్పడీన ద్రోణి ప్రభావంతో కురుస్తోన్న వర్షం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏలూరు జిల్లాలో 186.6 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లాలో 102 మి.మీ వర్షపాతం, శుక్రవారం నుంచి శనివారం ఉదయం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 15.4 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లాలో 12.02 మి.మీ వర్షపాతం నమోదైంది. శనివారం జిల్లా కేంద్రం ఏలూరులో భారీ వర్షం నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 మి.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని, మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని శాఖాధికారులు తెలిపారు.

Advertisement
Advertisement