గోదావరిలో వ్యక్తి మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

గోదావరిలో వ్యక్తి మృతదేహం లభ్యం

Published Sun, Nov 12 2023 1:46 AM

-

యలమంచిలి: తణుకు పాతూరుకు చెందిన మార్లపూడి జోషిబాబు (30) చించినాడ వద్ద వంతెన పైనుంచి వశిష్ట గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాజుల విజయ్‌నాగ ప్రసాద్‌ చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన జోషిబాబు గోదావరిలోకి దూకాడు. అతని కోసం గాలించగా 10వ తేదీ శుక్రవారం సాయంత్రం గోదావరిలో జోషిబాబు మృతదేహం లభించింది. దీంతో మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య కీర్తి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పులు, ఆస్తి వివాదాల నేపథ్యంలో తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కీర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement