ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే శివాలయాల్లో
శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కాలువ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.
భీమవరం ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయం, జుత్తిగ సోమేశ్వరస్వామి ఆలయం, పట్టిసం వీరేశ్వరస్వామి ఆలయాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామిని
దర్శించుకునేందుకు శివాలయాలకు పోటెత్తారు. – సాక్షి నెట్వర్క్