గ్రూప్‌–1, 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1, 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు

Published Sun, Nov 19 2023 12:54 AM

-

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గ్రూప్‌–1,2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్‌1,2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ (www.sakshieducation. com) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉ చిత అవగాహన సదస్సులను నిర్వహించనుంది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపే రయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్‌.కామ్‌ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికి తెల్సిందే.

గెస్ట్‌ స్పీకర్‌గా బాలాలత

ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్‌ టాపర్‌ బాలాలత గ్రూప్‌1, గ్రూప్‌ 2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్‌ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె గ్రూప్‌–1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం తోపాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 89776 25795 ఫోన్‌ నంబర్‌కు తమ పేరు, ఫోన్‌ నంబర్‌, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపగలరు.

ముఖ్య సమాచారం అవగాహన సదస్సు తేదీ: నవంబర్‌ 25, 2023(శనివారం) వేదిక టీటీడీ కల్యాణ మండపం, ఆర్‌టీసీ బస్టాండ్‌ దగ్గర, ఏలూరు. సమయం ఉదయం 09:30 నుంచి 12:30 వరకు

నవంబర్‌ 25వ తేదీన ఏలూరులో సదస్సు

గెస్ట్‌ స్పీకర్‌గా సివిల్స్‌ విజేత బాలాలత

లక్ష్యం: గ్రామీణ, పట్టణ విద్యార్థులకు గ్రూప్‌–1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం

Advertisement
Advertisement