22 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు | Sakshi
Sakshi News home page

22 కిలోల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్టు

Published Wed, Dec 6 2023 1:22 AM

-

కాళ్ల: పాడేరు నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు యువకులను అరెస్టు చేసి వారి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీఎస్‌ వీరభద్రరావు మంగళవారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు నిఘా ఉంచామన్నారు. ఈ కమ్రంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామానికి చెందిన నలుగురు యువకులు పాడేరు నుంచి రహస్యంగా గంజాయిని తీసుకువచ్చి కాళ్ల డంపింగ్‌ యార్డ్‌లో దాచిపెట్టారని, మంగళవారం దీనిని తీసుకువెళ్లడానికి యువకులు రాగా, మంగళవారం స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశామన్నారు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి యువతకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఎస్పీ రవి ప్రకాష్‌ ఆదేశాల మేరకు ఆకివీడు రూరల్‌ సీఐ సత్యనారాయణ, కాళ్ల పోలీసులు, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో కలిసి కాళ్ల డంపింగ్‌ యార్డ్‌ వద్ద తహసీల్దార్‌ కృష్ణారావు సమక్షంలో వారిని అరెస్ట్‌ చేసి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.22 వేలు ఉంటుందని, నిందితులను భీమవరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారని ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement