దెందులూరులో కూటమికి గట్టి షాక్‌ | Sakshi
Sakshi News home page

దెందులూరులో కూటమికి గట్టి షాక్‌

Published Mon, Apr 8 2024 1:05 AM

- - Sakshi

దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. టీడీపీ బీసీ సాధికారిత కమిటీ రాష్ట్ర చైర్మన్‌, ఏపీ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలమోలు అశోక్‌గౌడ్‌ ఆదివారం నెల్లూరులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీవీఆర్‌కే చౌదరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. పెదవేగి టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జి, పెదవేగి మండల సీనియర్‌ నాయకులు పాలడుగు భానుప్రకాష్‌, పెదవేగి కోఆపరేటివ్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం.వరప్రసాద్‌, డీసీసీ కార్యదర్శి సీహెచ్‌ కిరణ్‌, బీజేపీ పెదవేగి మండల అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌, జిల్లా గౌడ సంఘ యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌లు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఎంపీ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్నారు.

ఇది ట్రయల్‌ మాత్రమే: అబ్బయ్య చౌదరి

ఈ సందర్భంగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో ఆదరణకు లోటు లేదని, సముచిత స్థానాలకు కొదవ లేదని, ఇది ట్రయల్‌ మాత్రమేనన్నారు. మరింత మంది నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరతారని వివరించారు. ఇటీవలే దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన వందలాది మంది టీడీపీ, బీజేపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయన్నారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలమోలు అశోక్‌గౌడ్‌ చింతమనేని ప్రభాకర్‌ దాడులు, దౌర్జన్యాలు, కుల అహంకారం, అవమానాలు భరించలేక టీడీపీని వీడారని, స్వయంగా అశోక్‌గౌడ్‌ చెప్పిన సంగతి రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. పెదవేగి మండల టీడీపీ, బీజేపీ కీలక నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి సైతం వైఎస్సార్‌సీపీలో చేరడం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనాదక్షత, వైఎస్సార్‌సీపీ పటిష్టతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు, టీటీడీ బోర్డు మెంబర్‌ నెరుసు నాగ సత్యం, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, మండల పార్టీ అధ్యక్షులు జానంపేట బాబు, కామిరెడ్డి నాని, సొసైటీ చైర్మన్‌ చల్లగోళ్ళ భూస్వామి, పార్టీ నాయకులు గుత్తా ప్రసాద్‌, బాలస్వామి ఉన్నారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. అబ్బయ్య చౌదరి ప్రజాదరణలో దూసుకుపోతూ పటిష్ట ప్రణాళికతో దెందులూరును వైఎస్సార్‌సీపీకి అభేద్యమైన కోటగా మారుస్తున్నారన్నారు.2019 సీన్‌ రిపీట్‌ కోసం ఎదురుచూస్తున్నామన్నారుఉ. అబ్బయ్య చౌదరి కొడుతున్న దెబ్బలకు చింతమనేని ‘అబ్బా’ అంటున్నాడని, ఆయన పక్కా వ్యూహాలతో టీడీపీని మట్టి కరిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మరింత ఉత్సాహంగా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారంటున్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ బీసీ సాధికారిత కమిటీ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌

పెదవేగి బీజేపీ మండల అధ్యక్షుడితో పాటు పలువురి చేరిక

వైఎస్సార్‌సీపీలో చేరిన శంకర్‌ గౌడ్‌, భాను ప్రకాశ్‌

1/3

2/3

3/3

Advertisement
Advertisement