చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు
మొగల్తూరు: మీ చల్లని దీవెనలతో మరోసారి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేలా బలపర్చా లని చీఫ్ విప్, నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి ము దునూరి ప్రసాదరాజు ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం మండలంలోని వారతిప్ప గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ముందుగా గ్రామంలోని విజయదుర్గ అమ్మవారిని దర్శించుకు న్నారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ మహిళలకు చేకూరిన లబ్ధిని వివరించారు. గ్రామంలో మురుగు నీరు పారే సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురాగా రాబోయే రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానన్నారు. గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి, ప్రతి 50 కుటుంబాలకు వలంటీర్లను నియమించామని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అని ప్రసాదరాజు అడగ్గా, అందరికీ అందుతున్నాయని, సీఎం జగన్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలకు ఫ్యాన్ గురుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ మరోమారు అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పారు. ఆయన వెంట జెడ్పీటీసీ తిరుమాని బాపూజీ, వైస్ ఎంపీపీ కై లా సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు తిరుమాని వ రలక్ష్మి, లింగం ఏసుబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి ఏసుబాబు, బర్రి శంకరం ఆండ్రాజు చల్లారావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు, బందన పూర్ణచంద్రరావు, తిరుమాని శివనాగరాజు, కారాడి వెంకటేశ్వర్లు, కొల్లాటి కొండయ్య తదితరులు ఉన్నారు.