కలెక్టర్‌ అభినందన | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ అభినందన

Published Sat, Apr 29 2023 5:30 AM

-

బీబీనగర్‌: మండలంలోని సాంఘిక సంక్షేమ సైనిక్‌ మహిళా కళాశాలకు చెందిన విద్యార్థులు సుష్మ, స్నేహలత, మానస, శిరీష, వర్షితలు మే 3వ తేదీన నేపాల్‌లోని ఖాట్మాండు ప్రాంతంలో నిర్వహించే పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యారు. దీంతో శుక్రవారం కలెక్టర్‌ పమేలా సత్పతి విద్యార్థుల ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. అలాగే డీసీపీ రాజేష్‌ చంద్ర అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పాండురంగశర్మ, సైనిక్‌ విభాగం డైరెక్టర్‌ రాఖీ చౌహన్‌, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ పావని, శ్రీనివాస్‌, సరోజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement