విద్యార్థిని అదృశ్యం | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Published Sun, Sep 24 2023 1:44 AM

-

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : విద్యార్థిని అదృశ్యమైంది. అర్వపల్లి మండలం లోయపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన పూజిత సూర్యాపేటలోని శ్రీనిధి కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఈనెల 20న పూజిత కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరింది. బస్సు మిస్‌ కావడంతో అదే గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై నెమ్మికల్‌ వరకు వచ్చింది. అనంతరం అక్కడినుంచి పూజిత కనిపించకుండాపోయింది. సాయంత్రం పూజిత ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో పూజిత తల్లి జయమ్మ శనివారం ఆత్మకూర్‌(ఎస్‌) పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement