ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి | Sakshi
Sakshi News home page

ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి

Published Tue, Nov 14 2023 1:50 AM

చెక్‌పోస్టు రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌  
 - Sakshi

సాక్షి,యాదాద్రి : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కె.జెండగే సూచించారు. సోమవారం ఆయన తుర్కపల్లి మండలం వాసాలమర్రి, బీబీనగర్‌ మండలం గూడూరు చెక్‌ పోస్టులను తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే కలెక్టరేట్‌లోని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వైవల్‌ టీం, స్టాటిస్టికల్‌ సర్వైవల్‌ టీంల కంట్రోల్‌ రూంను సందర్శించి బృందాల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం కంట్రోల్‌ రూం, ఎంసీఎంసీ సెంటర్‌ను సందర్శించారు. రికార్డులు, ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

ఫ కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే

Advertisement
Advertisement