ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Published Fri, Apr 7 2023 1:26 AM

ఆర్టీసీ చైర్మన్‌కు వినతిపత్రాన్ని సమర్పిస్తున్న 
ఎన్‌ఎంయూఏ నాయకులు - Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీ శివారెడ్డి, రీజినల్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగముని, సుధాకర్‌ కోరారు. గురువారం కడప ఆర్టీసీ బస్టాండు నుంచి చైర్మన్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డిపోలలో డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. సంస్థ నియమ నిబంధనలు పాటించడం లేదన్నారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, అందరూ సమన్వయంతో పని చేసి సంస్థను అభివృద్ధి బాటలో పయనింపజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సగినాల శ్రీనివాసులు, దాస్‌, రహమతుల్లా, జయరాం, భాష, జబ్బార్‌, రాయుడు, టీఎం బాష, ఫయాజ్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement