ఆచూకీ తెలపరూ..! | Sakshi
Sakshi News home page

ఆచూకీ తెలపరూ..!

Published Wed, Nov 15 2023 1:44 AM

శ్రీనివాసులు(ఫైల్‌)   - Sakshi

పులివెందుల రూరల్‌ : తమ కుమారుడి ఆచూకీ తెలపాలని పార్వతమ్మ కోరారు. ఆమె మంగళవారం విలేకరులతో తమ గోడు వెల్లబోసుకుంది. పులివెందులలోని సరస్వతి విద్యా మందిరం వెనుక భాగంలో నివాసముంటున్న తమ్మిశెట్టి వెంకటరాములు, పార్వతి కుమారుడు తమ్మిశెట్టి శ్రీనివాసులు (35) మూడు వారాల నుంచి కనిపించడం లేదు. అతనికి కొంత కాలం నుంచి మతిస్థిమితం సరిగా లేదు. ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పార్వతమ్మ తెలిపారు. ఎవరైనా అతన్ని గుర్తిస్తే వెంటనే 9390437013 అనే ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలని ఆమె కోరారు.

పోలీసుల ఆధ్వర్యంలో ప్రేమవివాహం

చాపాడు : మొర్రాయిపల్లె గ్రామానికి చెందిన బేరి మేఘన, ఇదే గ్రామానికి చెందిన రావలూరు సుధీర్‌కుమార్‌ మంగళవారం పోలీసుస్టేషన్‌ వద్ద గల దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఎస్‌ఐ మైనుద్దీన్‌ తెలిపిన వివరాల మేరకూ.. సోమాపురం గ్రామ సచివాలయ వలంటీరుగా పని చేస్తున్న మేఘన, రావలూరు సుధీర్‌ గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం వలంటీరు మేఘన కనిపించకపోవటంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేఘన, సుధీర్‌తో వెళ్లినట్లు పోలీసులు తెలుసుకుని, వారిని మంగళవారం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇద్దరు మేజర్లు కావటంతో.. కుటుంబీకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుస్టేషన్‌ పక్కనే ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద వివాహం చేసుకున్నారు.

Advertisement
Advertisement