లారీ ఢీకొని మహిళ దుర్మరణం | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

Published Sat, Nov 18 2023 1:48 AM

మృతి చెందిన వెంకటసుబ్బమ్మ   - Sakshi

బద్వేలు అర్బన్‌ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని చెన్నంపల్లెకు చెందిన వల్లెపు వెంకటసుబ్బమ్మ (39) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈమె భర్త సుబ్బరాయుడు 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఓ పని నిమిత్తం బద్వేలుకు వచ్చేందుకు చెన్నంపల్లె సమీపంలో ఆటో కోసం రోడ్డు పక్కన వేచి ఉండగా.. బద్వేలు నుంచి మైదుకూరు వైపు వేగంగా వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. 9 ఏళ్ల క్రితం తండ్రి, ప్రస్తుతం తల్లి మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. మృతురాలి సోదరుడు వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరాజు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement