Sakshi News home page

●సమున్నత గౌరవం...

Published Mon, Nov 20 2023 1:46 AM

-

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో బడుగు, బలహీన వర్గాలకు సమున్నత గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం హోదా కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషాకు దక్కింది. మరో ముస్లి మైనార్టీ నేత జకియా ఖానమ్‌కు ఎమ్మెల్సీ ఇస్తూనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ హోదా కల్పించారు. బీసీలకు చెందిన రమేష్‌యాదవ్‌కు ఎమ్మెల్సీ లభించింది. మైదుకూరుకు చెందిన మదీనా దస్తగిరిని జిల్లా వక్స్‌బోర్డు చైర్మన్‌గిరి దక్కింది. అలాగే జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్‌ కానుక, చేయూత, ఆసరా, బీమా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, కల్యాణమస్తు, షాదీతోఫా, జగనన్న తోడు తదితర పథకాల ద్వారా జిల్లాలోని 19,54,575 మందికి రూ.12,061 కోట్లు లబ్ధి చేకూరింది. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 12,86,500 మంది ఉన్నారు. ఆయా వర్గాలకు రూ.7,984.48 కోట్లు నేరుగా లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement