ప్రొద్దుటూరు క్రైం : అర్థరాత్రి దాటిన తర్వాత స్కూటీలో వెళ్తున్న యువకులు పోలీసులపై రాళ్లను విసిరిన సంఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. నైట్ పెట్రోలింగ్లో భాగంగా వన్టౌన్ ఎస్ఐ హైమావతి శనివారం వేకువ జామున 1.30 గంటల సమయంలో బైపాస్ రోడ్డులోని రెండు కుళాయిలకు వెళ్లే దారిలో సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పలువురిని పిలిచి ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జమ్మలమడుగు వైపు నుంచి ఇద్దరు యువకులు స్కూటీలో వస్తున్నారు. వారి రాకను గమనించిన పోలీసులు ఆపాల్సిందిగా చెయ్యి చాచారు. పోలీసులను చూసిన యువకులు స్కూటీలో మరింత వేగంగా వెళ్లే క్రమంలో పోలీసుల చెయ్యి వారిలో ఒకరికి తగలింది. కొంత దూరం ముందుకు వెళ్లిన యువకులు తిరిగి స్కూటీలో వెనక్కి వచ్చి రాయి తీసుకొని పోలీసులపై విసరడంతో ఎస్ఐ హైమావతికి తగిలి మొబైల్ ఫోన్ పగిలిపోయింది. తర్వాత యువకులు స్కూటీని వేగంగా నడుపుకుంటూ పారిపోయారు. మొబైల్ ఫోన్ పగిలిన అద్దాలు గుచ్చుకోవడంతో ఎస్ఐకి కొద్దిపాటి గాయమైనట్లు తెలుస్తోంది. రాయి విసిరిన వారు ఆకతాయిలా లేక ఇసుక అక్రమ రవాణాదారులా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇద్దరు యువకుల కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోలీసులపై రాళ్లు విసిరిన యువకులు
Published Sun, Dec 10 2023 1:20 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో దశకే అఖిలేష్ ఓటమి మ్యానిఫెస్టో!
సన్రైజర్స్ విధ్వంసం..లక్నోపై 10 వికెట్లతో ఘనవిజయం (ఫొటోలు)
గ్రామాల్లో ఓటెత్తారు
ధార్వాడలో 74.35 శాతం ఓటింగ్
లోక్సభకు పోలైన ఓట్ల వివరాలివే
కానుకల సమర్పణకు తరలిన భక్తులు
రమణీయం.. గంగమ్మ దేవి పూల రథోత్సవం
మార్చురీలో ఆత్మఘోష
మేడపైనుంచి పడి బీఈ విద్యార్థి మృతి
పర్యాటకుల స్వర్గధామం భీమనకొండ
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement