విద్యార్థిని దూషించిన వారిపై ఎస్సీఎస్టీ కేసు | Sakshi
Sakshi News home page

విద్యార్థిని దూషించిన వారిపై ఎస్సీఎస్టీ కేసు

Published Sun, Dec 10 2023 1:20 AM

-

కొండాపురం : స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నాగమణి అనే విద్యార్థిని స్పృహ కోల్పోయిన ఘటన శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. నాగమణి బయోమెట్రిక్‌ వేసేందుకు ఆఫీస్‌ గది వద్దకు వెళ్లింది. గతంలో ఇదే పాఠశాలలో పనిచేసిన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ వెంకట నాగలక్ష్మి, ఆమె భర్త అశోక్‌కుమార్‌తో అదే సమయంలో ప్రిన్సిపాల్‌తో మాట్లాడేందుకు వచ్చారు. అక్కడ వారికి ఎదురుపడిన నాగమణిని దూషించడంతో ఆమె భయాందోళనకు గురై స్పృహ కోల్పోయింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తీసికెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పోయేందుకు ఆ విద్యార్థిని తల్లి కారణమనే ఉద్దేశంతో వారు దూషించారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు. ఎంఈఓలు ఓబులేసు, రామయ్య కూడా ఈ ఘటనపై ఆరా తీశారు.

Advertisement
Advertisement