వైఎస్సార్‌సీపీలో 25 కుటుంబాలు చేరిక | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో 25 కుటుంబాలు చేరిక

Published Mon, Dec 11 2023 1:02 AM

గోవిందరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి 
వైఎస్సార్‌సీపీలో చేరిన కుటుంబాలు - Sakshi

పోరుమామిళ్ల : పట్టణంలోని కొలిమివీధి, పొట్టిగారివీధి, ఉద్దికట్టవీధికి చెందిన 25 కుటుంబాల టీడీపీ వారు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. బట్టు కాశయ్య, కండక్టర్‌ కాశయ్యల ఆధ్వర్యంలో సంగీత శీను, రంగాచారి, మధు, ఓంప్రసాద్‌, మురళి, శ్రీహరి, శంకరాచారి, లక్ష్మినారాయణాచారి, సుధాకర్‌, సుభాషిణి, విజయమ్మ, షంషీర్‌, ఖాదర్‌బాషా, అన్వర్‌, బాలబ్రహ్మాచారి, మల్లికార్జునాచారి తదితర 25 కుటుంబాలకు చెందిన వారికి పార్టీ కండువాలు కప్పి వారిని గోవిందరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలానికి రూ. 384 కోట్లు నిధులు రాగా అందులో పట్టణానికే 4 సచివాలయాల నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించారన్నారు. పట్టణ అభివృద్ధికి మరో వంద కోట్లకు పైగా రాగా ఉద్దికట్టవీధిలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, వీధిరోడ్డు, శివాలయం వీధిలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేశామన్నారు. ప్రధాన రహదారిలో డివైడర్‌ రోడ్డు కోసం రూ. 23 కోట్లు నిధులు కేటాయించారన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న వైఎస్‌ జగన్‌ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కరెంట్‌ రమణారెడ్డి, వైస్‌ ఎంపీపీ సీఎం బాషా, మండల కోఆప్షన్‌ మెంబర్‌ అల్లా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీవ్‌బాషా, ఉపసర్పంచ్‌ రాళ్లపల్లె రవికుమార్‌, మాజీ ఉపసర్పంచ్‌ నరసింహులు, పట్టణ కన్వీనర్‌ హబీబ్‌, యువజన కన్వీనర్‌ చాపాటి సాయి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement