రామయ్యను దర్శించుకున్న న్యాయమూర్తి | Sakshi
Sakshi News home page

రామయ్యను దర్శించుకున్న న్యాయమూర్తి

Published Fri, Dec 15 2023 1:24 AM

రామయ్య ప్రధాన గోపురం వద్ద జడ్జి భవిత  - Sakshi

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని ఏకశిలపై వెలసిన సీతారామలక్ష్మణులను గురువారం రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ(అమరావతి) మెంబర్‌ సెక్రటరీ(డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి) ఎం.బబిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె రంగమండపంలో సేదతీరి, స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆమె వెంట కడప డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌ మరియు సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ షేక్‌ బాబా ఫక్రుద్దీన్‌, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్సై మధుసూదన్‌ రావు, సిద్ధవటం కోర్ట్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement