రేషన్‌ సరుకులు పొందేందుకు వెసలుబాటు | Sakshi
Sakshi News home page

రేషన్‌ సరుకులు పొందేందుకు వెసలుబాటు

Published Fri, Dec 15 2023 1:24 AM

- - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌: రేషన్‌ కార్డు దారులు సరుకులు పొందేందుకు మరింత వెసలుబాటు కల్పించినట్లు కలెక్టర్‌ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ జరుగుతోందన్నారు. అయితే వివిధ కారణాలతో ఇంటి వద్ద రేషన్‌ సరుకులు పొందలేని వారు ప్రతినెల 17వ తేదిన వారి పరిధిలోసి సచివాలయం వద్ద అందుబాటులో ఉండే ఎండీయూ వాహనం ద్వారా పొందే వెసలుబాటును కల్పించారన్నారు. ఈ అవకాశాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా టోల్‌ ఫ్రీ నెంబరు 1967కు ఫోన్‌ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్‌ వివరించారు.

Advertisement
Advertisement