వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

Published Tue, Dec 26 2023 12:52 AM

-

మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామసముద్రం బోయవీధికి చెందిన రవి భార్య హారిక(32) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. గత కొంతకాలంగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుండగా, సోమవారం మరోసారి నొప్పి అధికమవడంతో భరించలేక నిద్రమాత్రలు మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచా యతీ బుచ్చిరెడ్డిగారిపల్లెకు చెందిన రమణప్ప కుమారుడు వెంకటరమణ(38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి భార్య అనారోగ్యంతో పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెను తనవద్దకు పంపలేదన్న మనస్తాపంతో సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
Advertisement