ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

Published Tue, Apr 23 2024 8:30 AM

ఉరి వేసుకుని మృతిచెందిన మున్ని 
 - Sakshi

కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వివాహిత జాగిరిమున్ని (36) తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వారి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్నికి గత 18 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పీరావలితో వివాహమైంది. భర్త కువైట్‌లో పనిచేసేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది. కాశినాయన ఏఎస్‌ఐ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement