ఔషధ తయారీ రంగంలో ఉన్న లారస్ ల్యాబ్స్ వైజాగ్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని 2017 జూన్ నాటికి నెలకొల్పుతోంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్తోపాటు యూఎస్లోని బోస్టన్లో ఇటువంటి సెంటర్లున్నారుు. 2,300 మంది సిబ్బందిలో 25 శాతం ఆర్అండ్డీలో పనిచేస్తున్నారు. ఈ విభాగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు సంస్థ సీఈవో సి.సత్యనారాయణ తెలిపారు. కంపెనీ ఈడీ రవి కుమార్తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వైజాగ్ కేంద్రానికి కొత్తగా 100 మందిని నియమిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా ఒకటి, 2017 చివరి నాటికి మరో తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. తయారీ కేంద్రాలకు కొత్తగా 200 మందిని తీసుకుంటామని వివరించారు. తయారీ, ఆర్అండ్డీ సెంటర్లకు కంపెనీ రూ.450 కోట్లు పెట్టుబడి పెడుతోంది.
వైజాగ్లో లారస్ల్యాబ్స్ ఆర్అండ్డీ కేంద్రం
Published Sat, Dec 3 2016 7:21 AM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement