భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో స్టాక్మార్కెట్లు

Published Mon, Jul 6 2015 10:37 AM

గ్రీస్ సంక్షోభ ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సోమవారం దుయం సాక్ట్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 307 పాయింట్ల నష్టంతో 27,786 దగ్గర, నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 8,398 దగ్గర ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో 84 వేల మార్క్ దగ్గర నిఫ్టీ గట్టి రెసిస్టెన్స్ను ఎదుర్కొంటోంది. ఇక సెక్టార్‌ సూచీల్లో కనస్యూమర్‌ డ్యూరబుల్స్‌ 1.05శాతం, రియాల్టీ 0.78శాతం,ఐటిసూచీలు 0.48శాతం నష్టపోతున్నాయి. ఇక నిఫ్టీ టాప్‌ గేయినర్స్‌ లిస్ట్‌లో బిపిసిఎల్‌ 3.00శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.73శాతం, సిప్లా 1.65 శాతం లాభపడుతున్నాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో ఎన్‌ఎమ్ డిసి 2.59శాతం, ఐసిఐసిఐ 2.21శాతం నష్టపోతున్నాయి.

Advertisement
Advertisement