బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..? | Sakshi
Sakshi News home page

బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..?

Published Wed, Oct 26 2016 11:38 AM

మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి కరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ పిక్చర్స్ తప్పుకుందన్న వార్త టాలీవుడ్ లో మాట్ టాపిక్ గా మారింది

Advertisement
Advertisement