స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Published Tue, Dec 20 2016 11:31 AM

కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఓ మూలమలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా టీచర్లకు చేతులు విరిగాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ఉపాధ్యాయులతో కలిసి 68 మంది విద్యార్థులు ఉన్నారు.