అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

Published Mon, Jun 12 2017 7:11 PM

అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు. ఓ జాతీయ చానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్‌ సెల్వం రూ.కోటికి బేరం పెట్టగా, శశికళ, పళనిస్వామి వర్గం ఏకంగా రూ.2 కోట్లు నగదుతో పాటు బంగారం ఆఫర్‌ ఇచ్చింది. జయలలిత మరణం అనంతరం పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసి, ఆ తర్వాత అడ్డం తిరగడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దీంతో జయ నిచ్చెలి శశికళ... ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరును ప్రకటించి పన్నీర్‌ సెల్వంకు చెక్‌ పెట్టిన విషయం విదితమే.