ి: రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి విలేకరుల అడిగిన కొన్ని ప్రశ్నలకు ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి దాటవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడగాల్సిన ప్రశ్నలను తనను అడుగుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాగూ అందబాటులోకి వస్తారని ఆ ప్రశ్నలను ఆయననే అడగాలని చెప్పారు. బుధవారం రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానంతరం పల్లె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై వీలైనంత త్వరగా విచారణ జరిపిస్తామని తెలిపారు. 27 మంది మరణించడాన్ని చిన్న విషయంగా చూడటం లేదని చెప్పారు. చంద్రబాబు రాత్రి పగలు ఈ విషయం గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించే అవకాశముందని వెల్లడించారు. ఇక విశాఖపట్నంలో యూనిటెక్కు కేటాయించిన 1400 ఎకరాలను భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్టు పల్లె చెప్పారు. ఈ భూమిని ఐటీ, ఇతర పరిశ్రమల కోసం ఇవ్వనున్నట్టు చెప్పారు.
'ఆ ప్రశ్నలేవో సీఎంనే అడగండి'
Published Wed, Jul 22 2015 7:15 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement