శశికళ కాన్వాయ్‌ పై దాడి | Sakshi
Sakshi News home page

శశికళ కాన్వాయ్‌ పై దాడి

Published Wed, Feb 15 2017 6:40 PM

అన్నాడీఎంకే నాయకురాలు ఎంకే శశికళ కాన్వాయ్‌ పై దాడి జరిగింది. కోర్టులో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బుధవారం సాయంత్రం బెంగళూరు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కాన్వాయ్‌ పై దాడికి పాల్పడ్డారు. వీరిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పన్నీర్‌ సెల్వం వర్గీయులే ఈ దాడికి పాల్పడివుంటారని శశికళ మద్దతుదారులు ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement